రాజేంద్రనగర్ శాస్త్రీపూరంలో భారీ అగ్ని ప్రమాదం

byసూర్య | Sat, Mar 18, 2023, 09:28 PM

నిబంధనలు  ఉల్లంఘనల  కారణంగా హైదరాబాద్ నగరానికి అగ్ని ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇలా  నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డెక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ ల్లో ప్రమాదాలు పలువురిని పొట్టనపెట్టుకున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ శాస్త్రీపూరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదాం‎లో జరిగిన అగ్గి రాజుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలకు గోదాంలోని రెండు డీసీఎం వాహనాలు దగ్ధం అయ్యాయి.  ప్లాస్టిక్ కాలిన ఘాటైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. గోదాం పక్కనే ఉన్నపాఠశాలను అధికారులు ఖాళీ చేయించారు. 


పాఠశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష సెంటర్ ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కానీ, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల గోదాంలను  నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.



Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM