మహిళల భద్రత కోసం...ప్రత్యేక బస్సులు తీసుకొచ్చిన టీ సర్కార్

byసూర్య | Sat, Mar 18, 2023, 09:27 PM

మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్  పట్టిష్ట చర్యలు  తీసుకొంటోంది. తాజాగా హైదరాబాద్ సిటీలో మహిళల భద్రత కోసం రెండు షీ షటిల్ సర్వీసులు ప్రారంభమయ్యాయని ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. శుక్రవారం రాయదుర్గం జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డుల కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బస్సును తయారుచేశారని తెలిపారు. మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు ఏర్పాటు చేశారని వివరించారు. భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు కూడా ఉంటారని నిర్వాహకులు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ ముఖ్య అతిధి కాగా, సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎస్ సీ ఎస్ సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM