చనిపోయిన వాళ్లంతా క్యూనెట్ ఏజెంట్లుగా గుర్తింపు,,,స్వప్నలోక్ అగ్నిప్రమాదం ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు

byసూర్య | Sat, Mar 18, 2023, 07:51 PM

నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి లక్షలు దోచుకుంటున్న సంస్థకు చెందిన ప్రతినిధులే ఇటీవల  సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మరణించినట్లుగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అయితే.. వీళ్లంతా 'క్యూ నెట్' అనే కంపెనీలో పని చేస్తున్నారు. అయితే వాళ్లు పనిచేసిన క్యూ నెట్ సంస్థ గురించి ప్రభుత్వం కూపీ లాగుతోంది. ఈ క్యూ నెట్ సంస్థ.. నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి వారిని బుట్టలో వేసుకొని వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. దీనిపై వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా దీనిని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని సూచించారు. ఘటన జరిగిన సమయంలో క్యూనెట్‌ బాధితుడు చేసిన ఆరోపణలు దుమారం లేపాయి. ఈ సంస్థపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని.. ఈ సంస్థ నిరుద్యోగుల్ని మోసం చేస్తుందని బాధితుడు ఫణి ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లో తాను 5 లక్షలు చెల్లించి మోసపోయానని వాపోయాడు. గతంలో క్యూ నెట్‌ మీద పోలీసులకు ఫిర్యాదు చేశానని.. తమ కేసు సుప్రీం కోర్టులో ఉందన్నాడు. దీంతో.. క్యూనెట్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది.


చనిపోయిన ఆరుగురు కష్టపడి క్యూ నెట్‌లో జాయిన్ అయ్యారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో.. చేర్చుకుని యూనిట్ సంస్థ డబ్బులు ఇస్తుందని, కమిషన్ కూడా ఇస్తామని మభ్యపెడుతూ మోసం చేస్తుంది. దాదాపు 40 మందికిపైగా యువతీయువకులు ఈ క్యూ నెట్‌లో పనిచేస్తున్నారు. క్యూనెట్‌ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి లక్షన్నర నుంచి 3 లక్షలు కట్టించుకున్నట్టు తెలుస్తోంది. మోసపూరిత హామీలు ఇస్తూ యువతను క్యూనెట్‌ మభ్యపెడుతుంది. మలేషియా, సింగపూర్ తీసుకువెళ్తమని మీటింగ్స్ పెట్టి ప్రలోభ పెడుతున్నారు.


అయితే.. ఈ వ్యవహారం బయటకు రావటంతోనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. గతంలోనూ.. క్యూ నెట్ మోసాలపై సజ్జనార్ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అయితే.. క్యూ నెట్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న సంస్థపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మోసపూరిత క్యూనెట్‌‌పై తాను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నప్పుడు 70 కేసులు నమోదు చేసినట్టు గుర్తు చేశారు. ఈడీ ఆస్తులను కూడా జప్తు చేసిందన్నారు. అయినా కూడా క్యూ నెట్ తీరుమరలేదన్నారు. క్యూ నెట్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. క్యూ నెట్ వ్యవహారంపైన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దృష్టి పెట్టాలని సజ్జనార్ తెలిపారు. బీ ఎం5 సంస్థలో క్యూ నెట్ ఏజెంట్స్ ఆరుగురు మృతి బాధాకరమని అన్నారు.


"క్యూ నెట్‌ సంస్థ రోజుకో కొత్త ముసుగులో యువతను ఆకర్షిస్తుంది. ఒక్కొక్కరి దగ్గరి నుంచి లక్ష నుండి మూడు లక్షలు కట్టించుకున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీస్‌ నిఘా పెట్టాలి. క్యూ నెట్ బారిన పడి మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు." అని సజ్జనార్ వెల్లడించారు.



Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM