ఆ పరీక్షల ప్రశ్నా పత్రాలు కూడా లీక్ అయ్యాయి....వాటిని కూడా రద్దు చేయాలి

byసూర్య | Sat, Mar 18, 2023, 07:50 PM

తెలంగాణ రాష్ట్రంలో  టీఎస్పీఎస్సీ  పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ఇదిలావుంటే ఇప్పటికే సిట్ నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి రాగా.. నిందితులను కస్టడీలోకి తీసుకుని అధికారులు లోతుగా విచారిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో 5 ప్రశ్నా పత్రాలు ఉన్నట్టు అధికారులు గుర్తించటంతో.. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు మరో మూడు పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. కాగా.. ఇప్పుడు మరో వాదన వినిపిస్తోంది. సీడీపీఓ, ఈవో పరీక్షలలో పేపర్ లీక్ అయిందని ఆరోపిస్తూ ఎగ్జామ్ రాసిన మహిళా అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ లీకేజ్ వల్ల సుమారు 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీడీపీఓ, ఈవోO ఎగ్జామ్‌ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ కన్నా ముందు జరిగిన గ్రూప్-1 పరీక్షా పత్రం లీక్ అయ్యిందని తేలగా.. అదేవిధంగా తాము రాసిన పరీక్షలో కూడా అవకతవకలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


అయితే.. టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీక్ వ్యవహారంపై స్పందించిన మంత్రి కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు టీఎస్ పీఎస్సీ 155 నోటిఫికేషన్లు ఇచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏకకాలంలో 10లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత టీఎస్పీఎస్సీది అని అన్నారు. గత 8ఏళ్లలో భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ భర్తీ చేసిందన్నారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు.


"ఉమ్మడి ఏపీలో ఏపీపీఎస్సీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు టీఎస్ పీఎస్సీ మీద ఒక్క ఆరోపణ కూడా రాలేదు. కానీ, దురదృష్టవశాత్తు ఆ కమిషన్‌లోనే పనిచేసే ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి మాత్రమే కాదు.. దీని వెనక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటాం." అంటూ కేటీఆర్ తెలిపారు.



Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM