ఆధ్యాత్మిక మార్గంలోనే శాంతిస్థాపన

byసూర్య | Sat, Mar 18, 2023, 07:28 PM

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారానే సమాజంలో శాంతి నెలకొంటుందని వీరబ్రహ్మేంద్రస్వామి ముని మనవడు వీరంబోట్లయ్య స్వామి అభిప్రాయపడ్డారు. శనివారం బ్రహ్మంగారి మఠం నుంచి కర్నూలు షణ్ముఖ ఆశ్రమ పీఠాధిపతి కృష్ణ స్వామితో కలిసి హైదరాబాద్ వెళుతూ శనివారం ఉదయం జడ్చర్లలో బాద్మి శివకుమార్, రవిశంకర్ ల గృహంలో కొద్ది సేపు ఆగారు. స్వాములకు శివకుమార్ రవిశంకర్ లతో పాటు విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. శాలువా పూలమాలలతో సత్కరించి ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ కాలజ్ఞాన సృష్టికర్త వీరబ్రహ్మేంద్రస్వామి ఆశించినట్లుగా కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు సమానత్వంలో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరు దైవారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. స్వాములను కలిసిన వారిలో రవీందర్ చారి, శేఖర్ చారి, ప్రభాకర్ చారిలు ఉన్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM