ఆధ్యాత్మిక మార్గంలోనే శాంతిస్థాపన

byసూర్య | Sat, Mar 18, 2023, 07:28 PM

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారానే సమాజంలో శాంతి నెలకొంటుందని వీరబ్రహ్మేంద్రస్వామి ముని మనవడు వీరంబోట్లయ్య స్వామి అభిప్రాయపడ్డారు. శనివారం బ్రహ్మంగారి మఠం నుంచి కర్నూలు షణ్ముఖ ఆశ్రమ పీఠాధిపతి కృష్ణ స్వామితో కలిసి హైదరాబాద్ వెళుతూ శనివారం ఉదయం జడ్చర్లలో బాద్మి శివకుమార్, రవిశంకర్ ల గృహంలో కొద్ది సేపు ఆగారు. స్వాములకు శివకుమార్ రవిశంకర్ లతో పాటు విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. శాలువా పూలమాలలతో సత్కరించి ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ కాలజ్ఞాన సృష్టికర్త వీరబ్రహ్మేంద్రస్వామి ఆశించినట్లుగా కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు సమానత్వంలో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరు దైవారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. స్వాములను కలిసిన వారిలో రవీందర్ చారి, శేఖర్ చారి, ప్రభాకర్ చారిలు ఉన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM