byసూర్య | Sat, Mar 18, 2023, 07:21 PM
బాలానగర్ వివిధ గ్రామాలలో శనివారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఈదురు గాలులు వడగండ్ల వర్షం కురిసింది. దీంతో మామిడికాయలు నేల రాలాయి. మామిడి తోటల యజమానులు నష్టాల పాలయ్యారు. ప్రభుత్వం తమకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గుండేడు, చింతకుంట తండా, తిరుమలపూర్, పెద్ద రేవెల్లి, నేరెళ్లపల్లి, మూర్తి ఘనాపూర్ తదితర గ్రామాలలో మామిడి తోటలకు, టమోటా పంటకు నష్టం జరిగినట్లు వయా గ్రామాలకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారులు తెలియజేశారు. తాము సమగ్ర సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని వెల్లడించారు.