byసూర్య | Sat, Mar 18, 2023, 07:19 PM
విఏఓ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నారాయణపేట స్వామి వివేకానంద మున్సిపల్ పార్క్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి మాట్లాడుతూ. అర్హత కలిగిన విఏఓ లను సిసి లుగా గుర్తించాలని కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాధారణ మరణాలకు 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. విఏఓ లకు పోరాటానికి అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, జిల్లా కన్వీనర్ బలరాం, విఏఓ లు పాల్గొన్నారు.