బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన ఇఫ్కో డైరెక్టర్

byసూర్య | Sat, Mar 18, 2023, 07:17 PM

మెదక్ నియోజకవర్గం హవేలి ఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన అంబాల రాజయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా నామిని అయిన అతని భార్య అంబాల రాజవ్వ కు రూ. 2, 00, 000/- రెండు లక్షలు అదేవిధంగా గంగాపూర్ గ్రామానికి చెందిన పద్మిని. స్వామి విద్యుత్ షాక్ తో మరణించాడు, నామిని అయినా అతని భార్య పద్మిని. సంతోష కు రూ. 2, 00, 000/- రెండు లక్షలు బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన చెక్కును మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఇఫ్కో డైరెక్టర్ యం. దేవేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్‌ చెక్కు కొండ‌త భరోసా అని అన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హవేళిఘనాపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, మెదక్ జిల్లా ఎంపిటిసిల పోరం అధ్యక్షులు మాణిక్ రెడ్డి, శమ్నాపూర్ సర్పంచ్ నిజ్జని. లింగం, మెదక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాప. సాయిలు, నాయకులు రాగి. అశోక్, లింగ రెడ్డి, వెంకట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM