కార్పొరేట్ సంస్థలకు మొకరిల్లుతున్న ఎన్.డి.ఏ ప్రభుత్యం : బోయ

byసూర్య | Sat, Mar 18, 2023, 06:52 PM

కార్పొరేట్ సంస్థలకు మొకరిల్లుతున్న ఎన్. డి. ఏ ప్రభుత్యం కు తగిన బుద్ది ప్రజలే చెపుతారు అని ఐ. ఎన్. టి. యు. సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోయ రాంచందర్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని రాజీవ్ స్మారక కేంద్రంలో ఐ. ఎన్. టి. యు. సి మున్సిపల్ అధ్యక్షుడు ఎండీ వసీం అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఐ. ఎన్. టి. యు. సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోయ రాం చందర్ విచ్చేసి మాట్లాడుతూ యాదగిిరిగుట్టలోనీ వేదాద్రి పంక్షన్ హల్ లో ఐ. ఎన్. టి. యు. సి జిల్లా కమిటీ సమావేశం సోమవారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు డా. సంజీవ రెడ్డి, ఆలేరు నియోజక వర్గ ఇంఛార్జి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్లా ఐలయ్య యాదవ్, ఐ. ఎన్. టి. యు. సి జిల్లా అధ్యక్షుడు సుడుగు జీవన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రకాష్ గౌడ్, నాగన్న గౌడ్, చంద్రశేఖర్, భాస్కర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి లు పాల్గొంటారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వరగంటి రాజేందర్ గౌడ్, ఐ. ఎన్. టి. యు. సి బ్లాక్ అధ్యక్షుడు సమకురా రాజయ్య, నాయకులు నల్ల నర్సింహ, కడెం లింగస్వామీ, దోర్నాల బిక్షపతి, రుపాని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM