కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి: కల్లుగీత కార్మిక సంఘం

byసూర్య | Sat, Mar 18, 2023, 06:49 PM

కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించి, ప్రభుత్వమే ప్రచారం కల్పించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు అన్నారు. శనివారం మిర్యాలగూడ మండలం ముల్కల కాల్వ, లక్ష్మీపురం, రుద్రారం, గూడూరు గ్రామాలలో పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. బహుళ జాతి కంపెనీల మద్యం, శీతల పానీయాల ఉత్పత్తుల దాటికి తట్టుకోలేక కల్లు అమ్మకాలు పడిపోయాయన్నారు. కల్లులో అనేక పోషకాలు ఉన్నాయని, కల్లుకు క్యాన్సర్ నివారించే శక్తి ఉందని, ఉపాధి లేక గీత కార్మికులు వలస బాట పడుతున్నారన్నారు. ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ కల్పించాలని డిమాండ్ చేశారు. కల్లు గీత కార్మికులకు గీతన్న బంధు, 5వేల పెన్షన్, వాహనాలు ఇవ్వాలని, గీతన్న బీమా, నిరా ప్రాజెక్టును ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పాదయాత్ర బృందం మొక్తాల లింగస్వామి, పామనగుల్ల అచ్చాలు, అంజయ్య , , జెర్రిపోతుల ధనంజయ్య గౌడ్, కాసాని సత్తయ్య, భూపతి శ్రీనివాస్ సోషల్ మీడియా, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి పొదిల శ్రీనివాస్ , రుద్రారం మాజీ ఎంపీటీసీ మట్టపల్లి వెంకటేశ్వర్లు , సొసైటీ అధ్యక్షులు మట్టపల్లి శేఖర్ , గ్రామ సర్పంచ్ బొల్లం మల్లయ్య యాదవ్, లక్ష్మయ్య , సోమయ్య తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కట్ట మైసమ్మ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు Thu, Mar 28, 2024, 03:12 PM
పలు శుభకార్యాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం Thu, Mar 28, 2024, 03:11 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, Mar 28, 2024, 02:40 PM
బండి సంజయ్‌ పై కేసు నమోదు Thu, Mar 28, 2024, 02:34 PM
సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM