byసూర్య | Sat, Mar 18, 2023, 06:27 PM
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని త్రిపురారం మండలం భాజపా ప్రధాన కార్యదర్శి దనావాత్ గోవిందు నాయక్ అన్నారు. శనివారం డొంకతండా గ్రామ పంచాయతీ పరిధిలోని హార్జ్యాతండా గ్రామ ఆఫీస్ లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా గోవిందు నాయక్ మాట్లాడుతూ గ్రామంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్నలబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ను పొందవచ్చని, ఈ -కేవైసీ చేయించుకున్న వారికి ఐదు లక్షలు ఆరోగ్య బీమా అందుతుందన్నారు. కార్యక్రమంలో ఆపరేటర్ అంజిబాబు, కిరణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.