byసూర్య | Fri, Feb 03, 2023, 10:23 AM
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని శుక్రవారం పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సమావేశాలు జరిగే రోజుల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపింది. శాసనసభ చుట్టూ, గన్పార్క్ వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. గత రెండేళ్లు కరోనా నిబంధనల మేరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్వహించనున్నారు.