byసూర్య | Thu, Feb 02, 2023, 10:00 PM
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 5వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను మంత్రివర్గం ఆమోదించనుంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటనకు కేసీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు.ఈ నెల 5న నాందేడ్ జిల్లా కేంద్రంలో బీఆర్ ఎస్ భారీ సభను నిర్వహిస్తోంది.