బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Thu, Feb 02, 2023, 04:30 PM

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం ఇంద్రానగర్ కాలనీలో గురువారం బస్తీ దవాఖానను (పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... బస్తీలలో సుస్తీని దూరం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రజలకు అన్నీ రకాల వైద్య సౌకర్యాలను కల్పించిందని అన్నారు. పేదలు అధికంగా నివసిస్తున్న ప్రాంతం కావడంతో ఇంద్రానగర్ కాలనీలో బస్తీ దవాఖానా ఏర్పాటుకు ముందుకు రావడం జరిగిందన్నారు. స్థానికంగా అందుబాటులోకి తీసుకొచ్చిన బస్తీ దవాఖానాల్లో వైద్య సదుపాయాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Latest News
 

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. Sun, Jan 12, 2025, 09:50 PM
కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు Sun, Jan 12, 2025, 09:48 PM
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి Sun, Jan 12, 2025, 08:46 PM
రేపటి మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు Sun, Jan 12, 2025, 08:43 PM
శాంటినోస్‌ గ్లోబల్‌ స్కూల్‌ 8వ వార్సికోత్సవ వేడుకల్లో పాల్గొన సబితా ఇంద్రారెడ్డి Sun, Jan 12, 2025, 08:41 PM