బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Thu, Feb 02, 2023, 04:30 PM

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం ఇంద్రానగర్ కాలనీలో గురువారం బస్తీ దవాఖానను (పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... బస్తీలలో సుస్తీని దూరం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రజలకు అన్నీ రకాల వైద్య సౌకర్యాలను కల్పించిందని అన్నారు. పేదలు అధికంగా నివసిస్తున్న ప్రాంతం కావడంతో ఇంద్రానగర్ కాలనీలో బస్తీ దవాఖానా ఏర్పాటుకు ముందుకు రావడం జరిగిందన్నారు. స్థానికంగా అందుబాటులోకి తీసుకొచ్చిన బస్తీ దవాఖానాల్లో వైద్య సదుపాయాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Latest News
 

కవితే సూత్రధారి, పాత్రధారి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఛార్జిషీట్ Fri, May 10, 2024, 10:33 PM
అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన 'వండర్‌లా'.. ఆ 3 రోజులపాటు వాళ్లందరికీ డిస్కౌంట్ Fri, May 10, 2024, 09:08 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి స్పెషల్ ట్రైన్స్, పూర్తి వివరాలివే Fri, May 10, 2024, 09:04 PM
'జేబులో రూ.150తో హైదరాబాద్ వచ్చా'.. పొలిటికల్ జర్నీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Fri, May 10, 2024, 08:59 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు Fri, May 10, 2024, 08:55 PM