![]() |
![]() |
byసూర్య | Sat, Jan 28, 2023, 10:57 AM
నార్సింగి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో వార్షిక మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ సందీప్ రెడ్డి తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీ, గ్రేహాండ్స్, మంచిరేవుల, వీరభద్ర స్వామి ఆలయం, ఎన్సీసీ అర్బన్ టవర్స్, శ్రీకృష్ణ గోశాల, శ్రీనగర్ ప్రాంతాలలో సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.
కోకాపేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 11గంటల నుంచి 12. 30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని కోకాపేట గ్రామం , గోల్డన్మల్, బాబుఖాన్ విల్లాస్, ఘర్ సంస్థ, ప్రెస్టేజ్ విల్లాస్, 250 గజాల కాలనీలలో సరఫరా ఉండదని పేర్కొన్నారు.