![]() |
![]() |
byసూర్య | Sat, Jan 28, 2023, 11:00 AM
మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శనివారం మంత్రి సబితారెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య సంఘం బాలాపూర్ మండల అధ్యక్షుడు నాళ్ల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, బాలాపూర్ మండలంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం లేకపోవడంతో మంత్రి సబితారెడ్డి దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. జిల్లెలగూడలోని థాతునగర్ వద్ద ఆలయ నిర్మాణానికి మంత్రి స్థలం కేటాయించినట్లు తెలిపారు. భూమి పూజ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆయన కోరారు.