తెలంగాణలో వారికి అలర్ట్
byసూర్య |
Fri, Jan 27, 2023, 03:51 PM
తెలంగాణలో మార్చి 13 నుంచి టీఎస్ సెట్ పరీక్షలు జరగనున్నాయి. అధ్యాపక ఉద్యోగాల అర్హతకు సంబంధించిన ఈ పరీక్షను మార్చి 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 25తో ముగిసింది. రూ.1,500 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 5 వరకు, రూ.3,000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Latest News