byసూర్య | Fri, Jan 27, 2023, 02:28 PM
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులు చదువు మానేయద్దని విక్రం చక్కని గానం చేసి పాట పాడారు. చిన్నారులచే పాటల కార్యక్రమాలు, డాన్స్ ప్రోగ్రాము నిర్వహించారు. ఈ ప్రోగ్రాం ని చూడడానికి వందల మంది విద్యార్థిని విద్యార్థినులు వచ్చారు. చదువుపై అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో విక్రమ్ గానం చేశారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయక పాటను పాడి చిన్నారులు చదువును వదులుకోవద్దు అనే అంశాన్ని అర్థం వచ్చేలా పాడారు. చిన్నారులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా గానం చేశారు. విద్యార్థిని విద్యార్థుల ప్రజాప్రతినిధుల గుర్తుండేలా గానం చేశారు. ఈ సందర్భంగా షి టీం కళాబృందం పాట పాడిన విక్రమ్ ను అభినందించారు.