byసూర్య | Fri, Jan 27, 2023, 02:30 PM
బీర్కుర్ మండలం లోని మార్కెట్ యార్డ్ లో బీ. అర్. ఎస్. నాయకులు ద్రోనవల్లి సతీష్ ఆధ్వర్యం లో శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ బాన్స్వాడ అభివృద్ది ప్రదాత పోచారం శ్రీనివాసరెడ్డి మీద అనవసర మాటలు మాట్లాడితే సహించేది లేదు అని హెచ్చరించారు. అలాగే కులాల పేరుతో మత రాజకీయాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆని అన్నారు. ప్రజల లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కి ఉన్న ఆదరణను చూసి బీజేపీ నేత మాల్యాద్రి రెడ్డి కి మతి బ్రమించి ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదు అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లాడిగామా వీరేశం, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఆ వారి గంగారం, ఎంపీటీసీ సందీప్ పటేల్, కోఆప్షన్ ఆరిఫ్ పాల్గొన్నారు.