కంటి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

byసూర్య | Fri, Jan 27, 2023, 02:12 PM

కంటి పరీక్షలకు వచ్చే వారికి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్ పల్లి గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. కంటి పరీక్షకు చేయించుకున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 18 ఏళ్ళు పైబడ్డ ప్రతి వ్యక్తికి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి రీడింగ్ అద్దాలు ఇవ్వాలని సూచించారు. ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరపాలని సూచించారు. పరీక్షలకు సంబందించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM