అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Jan 27, 2023, 01:50 PM

నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలంలోని పిట్టంపల్లి, భాస్కర్లబాయి గ్రామాల్లో రూ. 60 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారని, ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది దేశం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు అదేవిధంగా భారతదేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM