అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Jan 27, 2023, 01:50 PM

నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలంలోని పిట్టంపల్లి, భాస్కర్లబాయి గ్రామాల్లో రూ. 60 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారని, ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది దేశం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు అదేవిధంగా భారతదేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.


Latest News
 

స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం Fri, Mar 29, 2024, 11:44 AM
ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు Fri, Mar 29, 2024, 11:44 AM
దారుణ... కాటేదాన్ లో మహిళ హత్య Fri, Mar 29, 2024, 11:42 AM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 11:41 AM
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM