![]() |
![]() |
byసూర్య | Fri, Jan 27, 2023, 01:50 PM
నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రైతు లింగం(40) తన భార్య లలిత కలిసి ద్విచక్ర వాహనంపై కామారెడ్డి జిల్లా భిక్కనూరు శుభకార్యానికి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. భిక్కనూరు శివారులో లారీ ఢీకొట్టడంతో లింగం అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి ఇద్దరు కుమారులు స్వామి, మహేష్, ఒక కుమార్తె భార్గవి ఉన్నారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే లింగం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.