తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు

byసూర్య | Fri, Jan 27, 2023, 12:07 PM

తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నేషనల్‌ టూరిజం డేను పురసరించుకొని హైదరాబాద్‌లోని తెలంగాణ పర్యాటక శాఖ కార్యాలయంలో టూరిజం అధికారులను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు పర్యాటక రంగాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి పర్యాటక ప్రదేశాలను నిర్లక్ష్యం చేశారని వాపోయారు.

సీఎం కేసీఆర్‌ కృషితో రామప్ప దేవాలయానికి యునెసో గుర్తింపు లభించిందని అన్నారు. పోచంపల్లి గ్రామం వరల్డ్‌ బెస్ట్‌ టూరిజం విలెజ్‌గా ఎంపికైందని చెప్పారు. తెలంగాణలో బుద్ధిజానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టూరిజం అధికారులు ఓం ప్రకాశ్‌, మహేశ్‌, బుద్ధవనం అధికారి శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM