తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు

byసూర్య | Fri, Jan 27, 2023, 12:07 PM

తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నేషనల్‌ టూరిజం డేను పురసరించుకొని హైదరాబాద్‌లోని తెలంగాణ పర్యాటక శాఖ కార్యాలయంలో టూరిజం అధికారులను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు పర్యాటక రంగాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి పర్యాటక ప్రదేశాలను నిర్లక్ష్యం చేశారని వాపోయారు.

సీఎం కేసీఆర్‌ కృషితో రామప్ప దేవాలయానికి యునెసో గుర్తింపు లభించిందని అన్నారు. పోచంపల్లి గ్రామం వరల్డ్‌ బెస్ట్‌ టూరిజం విలెజ్‌గా ఎంపికైందని చెప్పారు. తెలంగాణలో బుద్ధిజానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టూరిజం అధికారులు ఓం ప్రకాశ్‌, మహేశ్‌, బుద్ధవనం అధికారి శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కొత్త రేషన్ కార్డుల సర్వే వేళ కన్ఫ్యూజన్.. పాతవి తొలగిస్తారా..? మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ Fri, Jan 17, 2025, 08:15 PM
పుష్ప సినిమా చూసి,,, హీరో స్మగ్లింగ్ చేసే పద్ధతి చూసి,,,హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లింగ్ Fri, Jan 17, 2025, 07:52 PM
నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం.. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ Fri, Jan 17, 2025, 07:47 PM
ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఆదేశాలపై హరీష్ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్ Fri, Jan 17, 2025, 07:41 PM
సింగపూర్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం.. ఓపినింగే అదిరిపోయిందిగా Fri, Jan 17, 2025, 07:36 PM