రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

byసూర్య | Fri, Jan 27, 2023, 12:09 PM

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్ర పరిధిలో గల 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన బొందిలింగం తన భార్య లలితతో కలిసి ద్విచక్రవాహనంపై మండల కేంద్రానికి వస్తున్నట్లు తెలిపారు.


జాతీయ రహదారి మండలానికి వస్తుండగా కామారెడ్డి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వారిని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న లింగం అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య లలితకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వివరించారు.


Latest News
 

మార్కెట్లో నకిలీ కరాచీ మెహందీలు.. రూ. 8 లక్షల విలువైన కోన్లు స్వాధీనం Thu, Jan 15, 2026, 08:15 PM
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు.. హైదరాబాద్‌ మెట్రోకు కొత్తగా 60 కోచ్‌లు Thu, Jan 15, 2026, 08:11 PM
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై.. సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్ Thu, Jan 15, 2026, 07:37 PM
తెలంగాణలో కూడా జోరుగా కోడి పందేలు..! రూ.కోట్లల్లో బెట్టింగ్‌లు Thu, Jan 15, 2026, 07:33 PM
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీల సంఖ్య పెంపు Thu, Jan 15, 2026, 07:30 PM