గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

byసూర్య | Fri, Jan 27, 2023, 11:08 AM

గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. 508 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించారు. నిజామాబాద్ జిల్లా యర్గట్ల మండలానికి చెందిన పందెన సంజీవ్ కుమార్ నగరానికి వచ్చి చింతలకుంట, ఇంజినీర్స్ కాలనీలో నివాసం ఉంటూ వెయిటర్ పనిచేస్తున్నాడు. నిజామాబాద్ లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఎల్బీనగర్ చింతల్ కుంట ప్రాంతంలో ఎక్కవ ధరకు గంజాయిని విక్రయించేందుకు ఎల్బీనగర్ చంద్రపురి కాలనీకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు గురువారం రాత్రి సంజీవ్ కుమార్ ను అరెస్టు చేశారు. గంజాయి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM