![]() |
![]() |
byసూర్య | Thu, Jan 26, 2023, 07:48 PM
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఖమ్మం వీడియోస్ కాలనీలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకోల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా ముక్తార్, సుడా ఛైర్మెన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, మైనారిటీ నగర అధ్యక్షుడు తాజుద్దీన్, మంత్రి పీఏ రవి కిరణ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.