భవనాన్ని కూల్చేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి

byసూర్య | Thu, Jan 26, 2023, 07:39 PM

పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవనాన్ని కూల్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొనడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి మినిస్టర్ రోడ్ లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన భవనం వద్దకు చేరుకున్నారు. భవనం కూల్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదం చాలా బాధాకరం అన్నారు. ప్రమాదంలో మరణించిన ముగ్గురి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ను ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. ప్రమాద సమయంలో అన్ని శాఖల అధికారులు సకాలంలో తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పరిసర ప్రాంత ప్రజలను మున్నూరు కాపు సంఘ భవనంలోకి తరలించి వసతి, భోజన సౌకర్యాలను కల్పించినట్లు చెప్పారు. మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఎంతో శ్రమించారని అన్నారు. భవనాన్ని కూల్చేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని, గురువారం సాయంత్రం వరకు కూల్చివేతే పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ, తహసీల్దార్ శైలజ, ఈ ఈ సుదర్శన్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్ తదితరులు ఉన్నారు.


Latest News
 

తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్ Sun, Sep 24, 2023, 10:11 PM
చంద్రబాబు అరెస్ట్ లో రాజకీయ కోణాలే కనపడుతున్నాయి.... ఎమ్మెల్యే సీతక్క Sun, Sep 24, 2023, 09:31 PM
ముత్తిరెడ్డి మద్దతు, కేసీఆర్ ఆశీర్వాదంతో జనగాంలో జెండా ఎగరవేద్దాం.... పల్లా రాజేశ్వరరెడ్డి Sun, Sep 24, 2023, 09:30 PM
నియోజకవర్గ ప్రజలను తాను వదిలిపెట్టే ప్రస్తకే లేదు.... ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు Sun, Sep 24, 2023, 09:24 PM
నా రాజకీయ జీవితంలో జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు.... మోత్కుపల్లి నర్సింహులు Sun, Sep 24, 2023, 09:23 PM