byసూర్య | Thu, Jan 26, 2023, 11:25 AM
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బుధవారం దుద్యాల మండల పరిధిలోని సత్తర్ కుంట తండాలో కొనసాగుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం బోయిని తండాలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించి, చిల్ముల్ మైలారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.