![]() |
![]() |
byసూర్య | Thu, Jan 26, 2023, 11:01 AM
భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎమ్మెల్యే జోగు రామన్న నివాళులర్పించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట గల అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నేతలతో కలిసి గురువారం ఆ మహనీయుని విగ్రహనికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో బిహారీస్ పార్టీ నాయకులు మెట్టు ప్రహ్లాద్, సాజిద్ ఖాన్, గంగ రెడ్డి, ప్రశాంత్, సలీం, ఫెరోజ్, మహిళా నాయకురాళ్ళు కస్తాల ప్రేమల, స్వరూప, బొడిగం మమత, పర్వీన్, దళిత సంఘాల నాయకులు శైలేందర్ వాగ్మరే, తదితరులు పాల్గొన్నారు.