గ్రామ పంచాయతీకి వెంటనే నిధులు విడుదల చేయాలి

byసూర్య | Wed, Jan 25, 2023, 02:29 PM

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ సభ మంగళవారం సర్పంచి రామకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామపంచాయతీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని సర్పంచ్ రామకృష్ణ రావు తో పాటు సభ్యులు చెప్పారు. గ్రామంలో చేపట్టిన రైతు వేదిక ప్రహరీ గోడ నిర్మాణం, క్రీడా ప్రాంగణం, మురుగు కాలువల నిర్మాణం, వీధి దీపాలు, సీసీ రోడ్ల బిల్లులు ఇవ్వవలసి ఉందని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికాలంగా నిధులు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల కాలంగా నిధులు విడుదల చేయలేదని సభ్యులు తెలిపారు. గ్రామంలోని ఎస్సి వాడలో నీటి ఇబ్బందులు ఉన్నందున మూడు మినీ ట్యాంకులు నిర్మించడానికి గ్రామ సభ తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఖదీర్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ మనయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM