byసూర్య | Wed, Jan 25, 2023, 12:20 PM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో ఎల్ఈడి ఇండస్ట్రీ నుండి గ్రామం వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయడానికి రానున్నట్లు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు సకాలంలో హాజరుకావాలని కోరారు.