byసూర్య | Wed, Jan 25, 2023, 12:21 PM
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నేడు(బుధవారం) 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట తహశీల్దార్ రవిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ల ప్రతిజ్ఞ చేసి ఓటుపై అవగాహన ప్రాముఖ్యతను తెలియజేసి సీనియర్ ఓటర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ ఆంగోత్ అరుణ, వర్ధన్నపేట జడ్పిటిసి మార్గం బిక్షపతి, బిఆర్ఎస్ నాయకులు సిలువేరు కుమారస్వామి, వర్ధన్నపేట నయబ్ తాసిల్దార్ పవన్ కుమార్, హరిత, గిర్ధవర్ కృష్ణ స్వామి, వీఆర్ఏలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, బి ఎల్ వో లు, విద్యార్థులు పాల్గొన్నారు.