byసూర్య | Wed, Jan 25, 2023, 12:22 PM
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్ రైల్వే గేటు సమీపంలో మంగళవారం సుమారు 35 సంవత్సరాల వయసు ఉన్న ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. తీవ్ర గాయపడి రక్తస్రావం జరుగుతుండగానే నడుచుకుంటూ ముందుకు వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే వరి నాట్లు వేస్తున్న కొందరు రైతులు ఇది గమనించి 108 ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న జిఆర్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.