పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు
byసూర్య |
Thu, Dec 08, 2022, 12:40 PM
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహిళ అని చూడకుండా దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. షర్మిల ఘటనను అందరూ ఖండించాలని అన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, మరో ఏడాదిన్నర పాటు నియోజకర్గంపైనే దృష్టి పెడతానని చెప్పారు. తాను ఏ పార్టీలోకి వెళ్తాననే విషయాన్ని ఎన్నికలకు నెల ముందు చెపుతానని ఆయన తెలిపారు.
Latest News