పాద‌యాత్ర‌లో బండి సంజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

byసూర్య | Thu, Dec 08, 2022, 12:03 PM

నిర్మల్ జిల్లాలో తన పాదయాత్రకు విశేష ఆదరణ లభించిందని, నిర్మల్ జిల్లాను జీవితంలో ఎన్నటికీ మరిచిపోనని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ఐదో విడత పాదయాత్ర నిర్మల్ జిల్లాలో విజ‌య‌వంతంగా పూర్తైంది. పాద‌యాత్ర‌ బుధవారం రాత్రి జిల్లా సరిహద్దుల్లో ముగిసింది. బైంసా పట్టణంలో మొదలైన బండి ప్రజాసంగ్రామయాత్ర 10 రోజులపాటు కొనసాగి నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదంకుర్తి వద్ద ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బండి పాదయాత్రతో కార్య‌క‌ర్త‌ల్లో నూత‌నోత్సాహం నిండింది. పాద‌యాత్ర‌లో అన్ని చోట్లా జ‌నం భారీగా పాల్గొన్నారు. బైంసా, నిర్మల్, ఖానాపూర్ సభల్లో తరలివచ్చిన జనంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బండి పర్యటనలో బండి ప్ర‌సంగాలు యువతను ఆకర్షించడం స‌క్సెస్ అయ్యార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM