సమస్యల సత్వర పరిష్కారానికి కృషి
byసూర్య |
Thu, Dec 08, 2022, 12:14 PM
కాలనీలు, బస్తీలనే తేడా లేకుండా అన్నిప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జాబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ పేర్కొన్నారు. బోరబండ డివిజన్ వినాయకరావు నగర్ బస్తీల్లో రూ. 48 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాగంటి మాట్లాడుతూ. బస్తీల్లో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానన్నారు. సీసీ రోడ్డు పనులు పూర్తి అయితే బస్తీల ప్రజలకు అంతర్గత రవాణా సమస్య తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Latest News