byసూర్య | Tue, Dec 06, 2022, 04:20 PM
నకిరేకల్ నియోజకవర్గ నార్కట్ పట్టణంలో బి. ఆర్. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నార్కట్ పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి హాజరయ్యారు.ఆ తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యానన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం అంబేద్కర్ అని కొనయాడారు.