byసూర్య | Tue, Dec 06, 2022, 04:19 PM
దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా అని దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని 11వ వార్డులో రూ.60లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, వైస్ చైర్మన్ రహత్ అలీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ తస్కిన్ సుల్తాన, టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, పొన్నబోయిన సైదులు, తౌఫిక్ ఖాద్రీ, మూడవత్ జయప్రకాష్ నారాయణ, మహమ్మద్ రైస్, బొడ్డుపల్లి కృష్ణ, చిత్రం ప్రదీప్, ఇలియస్, పగిడిమర్రి రఘురాములు, గాజుల రాజేష్, శంసన్, శ్రీను తదితరులు.