byసూర్య | Tue, Dec 06, 2022, 01:14 PM
పోలీస్ నియామక ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని, ఆశావహులు మధ్యవర్తులకు డబ్బులిచ్చి మోసపోవద్దని సూచించారు.