byసూర్య | Sun, Dec 04, 2022, 06:06 PM
తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు. పాలమూరులో కొత్త కలక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 'వేదనలు, రోదనలతో బాధపడ్డ పాలమూరు జిల్లా ఈరోజు సంతోషంగా ఉంది. ఏ తెలంగాణ కోసం పోరాడామో ఆ దిశగా వెళ్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో మనమే భేష్. గురుకులాలను ఇంకా పెంచుతాం. చాలా కష్టపడి కంటి వెలుగు కార్యక్రమాన్ని తెచ్చినం. కంటి వెలుగు ఓట్ల కోసం పెట్టింది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందే. తెలంగాణలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజలకు మేలు జరగాలనే చేస్తున్నాం. ఏడేళ్ల క్రితం 60 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం' అని అన్నారు.