byసూర్య | Thu, Dec 01, 2022, 02:11 PM
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబరాక్ చెక్కుల పంపిణి బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి గ్రామంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎంపీపీ అశోక్ పటేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం రాజు శ్రీహరి, మండల తెరాస అధ్యక్షులు వెంకటరావు దేశాయ్, గ్రామ సర్పంచ్ అనిత విట్టల్ రెడ్డి, ఎంపీటీసీ సుశీల సహదేవ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పేరుగు హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ పానాది నారాయణ, గ్రామ జనరల్ సెక్రెటరీ పానాది అంజయ్య, మాజీ పార్టీ ప్రెసిడెంట్ పోచయ్య, గ్రామ పెద్దలు కత్తిగాం కృష్ణారెడ్డి బాల్ రెడ్డి, సాయబోయి, గ్రామపంచాయతీ సెక్రటరీ రాజా రత్నం తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.