byసూర్య | Thu, Dec 01, 2022, 02:09 PM
ఎమ్యెల్యే జాజాల సురేందర్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాల, ఇళ్లకు వెళ్లి టిఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా 60 వేల రూపాయల చెక్కును కంచం భూమవ్వకి, 19 వేల రూపాయల చెక్కును కంచం నారాయణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎరుకల సాయిలు, టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు నాగం సురేందర్, నాగం రాజయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు దుంపల ప్రశాంత్, నాగరాజు పాల్గొన్నారు.