byసూర్య | Thu, Dec 01, 2022, 02:05 PM
ఎల్లారెడ్డి - కామారెడ్డి రహదారిలో కొట్టాల్ సమీపంలోని ములమలుపు రోడ్డు వద్ద బుధవారం రాత్రి కారు బోల్తా కొట్టి కానిస్టేబుల్ కు గాయాలు తగిలాయి. ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పల్లి సాయులు తన స్వగ్రామం నిజాంసాగర్ మండలం ఆరేడ్ కు కారులో వెళ్తుంటే, అడవి పందుల గుంపు అడ్డురావడంతో కారు అదుపు తప్పి బోల్తాకొట్టింది. 108 అంబులెన్సులో గాయపడ్డ కానిస్టేబుల్ ను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.