byసూర్య | Thu, Dec 01, 2022, 02:11 PM
ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని రిమ్స్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రిమ్స్ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటరీలు రిమ్స్ నుండి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల ప్లకార్డు లను చేత పట్టుకొని అవగాహన కల్పిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రిమ్స్ సుపరింటెండెంట్ డాక్టర్ అశోక్, కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సరోజ, విద్య విల్సన్, బిఎస్సి నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిత, వైస్ ప్రిన్సిపాల్ శకుంతల, ఎన్ఎస్ఎస్ పిఓ శ్రీదేవి, పలువురు వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు