byసూర్య | Thu, Dec 01, 2022, 12:47 PM
బాసర ట్రిపుల్ ఐటీలో బుధవారం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. కానీ ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులు బయటకు రానీయ్యకుండా కప్పిపెట్టారు. బుధవారం మధ్యాహ్నం భోజనశాలలో విద్యార్థులకు చికెన్ వడ్డించారు. అది తిన్నాక ఒక్కసారిగా పలువురు విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ఇతర కారణాలతో ఆసుపత్రికి వెళ్లారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ సతీషకుమార్ నేరుగా ఆసుపత్రి వెళ్లి విద్యార్థులను పరామర్శించినట్లు సమాచారం.