byసూర్య | Thu, Dec 01, 2022, 12:46 PM
సీతాఫల్ మండి మేడిబావి లోని దేడ్ లాక్ బిల్డింగ్ దగ్గరలో కార్పొరేటర్ సామల హేమ సెట్విన్ పునరుద్దరణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సెట్విన్ పునరుద్దరణ పనులకు 4 లక్షల 50 వేల రూపాయలతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. సెట్విన్ పునరుద్దరణ పనులు పూర్తి అయ్యాక ఇందులో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ కోర్సులతో పాటు వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి పేద విద్యార్థులకు తక్కువ ఖర్చుతో వివిధ రకాల కోర్సులలో శిక్షణ పొందవచ్చు అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ కౌశిక్ తెరాస నాయకులు కరాటే రాజు, డివిజన్ అధ్యక్షులు నాగేందర్, రవి, సురేష్, రాజుమహిళ నాయకులు సునీత, జ్యోతి, అరుణ, లలిత, విజయ బిజెపి నాయకులు హరి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.