సెట్విన్ పునరుద్దరణ పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ సామల హేమ

byసూర్య | Thu, Dec 01, 2022, 12:46 PM

సీతాఫల్ మండి మేడిబావి లోని దేడ్ లాక్ బిల్డింగ్ దగ్గరలో కార్పొరేటర్ సామల హేమ సెట్విన్ పునరుద్దరణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సెట్విన్ పునరుద్దరణ పనులకు 4 లక్షల 50 వేల రూపాయలతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. సెట్విన్ పునరుద్దరణ పనులు పూర్తి అయ్యాక ఇందులో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ కోర్సులతో పాటు వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి పేద విద్యార్థులకు తక్కువ ఖర్చుతో వివిధ రకాల కోర్సులలో శిక్షణ పొందవచ్చు అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ కౌశిక్ తెరాస నాయకులు కరాటే రాజు, డివిజన్ అధ్యక్షులు నాగేందర్, రవి, సురేష్, రాజుమహిళ నాయకులు సునీత, జ్యోతి, అరుణ, లలిత, విజయ బిజెపి నాయకులు హరి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM