byసూర్య | Thu, Dec 01, 2022, 12:54 PM
పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యమని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ నియోజకవర్గానికి చెందిన 6 మందికి రూ. 6.50లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతోందన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల సురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లోకసాని తిరపతయ్య, టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, టిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు బోడ్డుపల్లి కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం దేవరకొండ మండల అధ్యక్షుడు జెల్ల రేణు గౌడ్, కసిరెడ్డి రవీందర్ రెడ్డి, వంకునవత్ బిక్కు, రేపాని ఇద్దయ్య, సామల రవి, బషీర్, రాజ్ కుమార్, దూడ బావోజి, రవి, శంకర్ నాయక్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.