ఇళ్లు లేని నిరుపేదలకు రూ.3 లక్షల ఇళ్ల పథకం..డిసెంబర్ నుంచి అమలు

byసూర్య | Wed, Nov 30, 2022, 10:44 PM

తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లను ఇస్తోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి పేదలకు అందించింది. ఇక సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం అందించే పథకంపై ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. సొంత స్థలాలుండి ఇళ్లు లేని నిరుపేదలకు రూ.3 లక్షల పథకాన్ని డిసెంబరులో ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.


రెండు పడకగదుల ఇళ్లు మంజూరై.. నిర్మాణాలు జరగని గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రూ.5.04 లక్షల పథకం మంజూరు కాని వారిని రూ.3 లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలని చెప్పారు. 2023 ఎన్నికల నాటికి ఏ గ్రామంలోనూ ఇళ్లు లేని నిరుపేదలు ఉండకూడదని కేటీఆర్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రానిచోట, స్థలాల సమస్య ఉన్నచోట సత్వరమే పరిష్కార మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. నిరుపేదలకు ఇళ్ల పంపిణీని ఏడాదిలోగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.


ఇక లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల మందికి ఈ సాయం అందించనుంది. గతంలో ఇల్లు పొందిన వారు అనర్హులని గృహనిర్మాణశాఖ పేర్కొంది. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ సహకారంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, తర్వాత పరిశీలనలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలు, నగరాల్లో డివిజన్ సభలు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.


సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునే వారికి 3 లక్షల రూపాయల మొత్తాన్ని నాలుగు విడతల్లో ఇవ్వాలని నిర్ణయించారు. ఇల్లును నిర్మించుకునే వారి సొంత ఇంటి స్థలం గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 75 గజాలు పట్టణ, నగర ప్రాంతాల్లో కనీసం 50 గజాలు ఉండాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రూ.3 లక్షల సాయాన్ని ఇంటి నిర్మాణం జరిగే సమయంలో బేస్‌మెంట్, గోడలు, శ్లాబ్, ఫినిషింగ్ ఇలా నాలుగు దశల్లో రూ.75 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా.. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.



Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM