byసూర్య | Wed, Nov 30, 2022, 03:33 PM
బుధవారం ఉదయం 10: 30 గంటలకు పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ కౌకుట్ల చంద్ర రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించనైనది. ఈ సమావేశంలో పట్టణంలోని వివిధ వార్డులలో సుమారు 90 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు తీర్మానించి ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ నాగారం పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, నిధుల సమీకరణ కోసం కృషి చేస్తున్నానని ఇందుకు కౌన్సిలర్లు అందరూ సహకరించాలని కోరారు. మంచి నీటి సమస్య తీర్చుటకు ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని హెచ్ ఎం డబ్ల్యు ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ వాణి రెడ్డి, వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, డి ఈ ఈ రఘు, మేనేజర్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.