byసూర్య | Tue, Nov 29, 2022, 01:14 PM
బహుజన్ సమాజ్ పార్టీ మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు బోనగిరి ప్రభాకర్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు ఫూలే 132వ వర్ధంతి సభ స్థానిక పద్మావతి ఫంక్షన్ హల్ నందు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి మాతంగి అశోక్ హాజరై మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సమాజ ఉద్ధరణ ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదని.. ఆశయక్ సాధన కోసం ఇల్లు వదిలి భార్యను వెంట తీసుకొని వెళ్ళిపోయియాడు. ప్రభుత్వ ఖజానా నుండి ఉచిత విద్య కల్పించి స్కాలర్షిప్ ఇవ్వాలన్నాడు. స్త్రీల కోసం 1848 సంవత్సరములో స్కూల్ స్థాపించిన మొదటి భారతీయుడు. 1851సంవత్సరంలో అంటరాని వారికోసం స్కూల్ ప్రారంభించడాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో బహుజనులకు 50% కేటాయించాలని మొదటిగా డిమాండ్ చేసాడు. బహుజనులకు రాజ్యాధికారం లేనందున అన్యాయం జరుగుతుందని ఆత్మపరిశీలన చేసుకోవాలి మహాత్మా ఆనాడే చెప్పాడు. మనం రాజ్యాధికారం సాధించడం కొరకు పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ అక్కి బాలకిషన్, జిల్లా కార్యదర్శి మరియు అసెంబ్లీ ఇంచార్జి కుమ్మరి సంపత్, నియోజకవర్గ అధ్యక్షుడు బోనగిరి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు మాతంగి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి నిషాని రాజమల్లు, కోశాధికారి ఏగోళపు వెంకన్న గౌడ్, తిమ్మాపూర్ మండల కన్వీనర్లు గుర్రం సత్యనారాయణ, అంబాల సతీష్, బెజ్జంకి మండల కన్వీనర్ మాతంగి తిరుపతి, శంకరపట్నం మండల కన్వీనర్ దేవునూరి భాస్కర్, పచ్చునూర్ సెక్టార్ అధ్యక్షుడు ఎల్కపల్లి రమాకాంత్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.